ప్రాయోజితాలు – పేరడీలు III

మే 22, 2009

చార్మినార్ యాస్బెస్టాస్ సిమెంట్ రేకులు పేరడీ

ఏంటి రాజశేఖర్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

ఆ ఏంలేదు లాలూ, సుడి తిరిగి మళ్ళీ నేనే గెల్చా. నా కొడుకు టీవీ బిల్డింగుకీ, అల్లుడి ఫార్మ్ హౌసుకీ పైకప్పు ఏమి దోచి వేయిద్దామా అని ఆలోచిస్తున్నా?

హిహిహి..(వెర్రి నవ్వు) ఇందులో పెద్దగా ఆలోచించటానికేముంది? రింగురోడ్డు, ఎయిర్పోర్టు తాకట్టుపెడితే సరి. నేను గతంలో ఇలానే పశువులకేసే గడ్డి అమ్ముకొని చాలా పైకప్పులు వేసుకొన్నాను. మా తాతగారు ఇలా సంపాదించిన డబ్బుతో వేసిన పైకప్పులు ఇంకా చెక్కు చెదరలేదు.

అలాగా, నిజమే. నువ్వు చెప్పినట్లే మన రింగురోడ్డు, ఎయిర్పోర్టు తాకట్టు పెట్టి మా బడుద్దాయిలకి పైకప్పులు వేయిస్తా.

**************************************************************
ఉడ్వర్డ్ గ్రైప్ వాటర్ (పాప ఏడ్చింది) పేరడీ

మేడం : హిహి…హిహి…హిహి
యువనేత : ఎవరది?
కార్యకర్త : మేడం నవ్వింది
యువనేత : ఉండు. చొంగ కార్చి, సూట్ కేసిచ్చొస్తా!
నేత తండ్రి : ఎ..వ..రు….అ..ది
యువనేత : మేడం నవ్వింది
నేత తండ్రి : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా కాలంలో మేమదే చేశాం!
నేత తాత : ఎ..వ..రు….అ..ది
నేత తండ్రి : మేడం నవ్వింది
నేత తాత : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా నాన్న అలానే చేసేవాడు.
నేత తాత తండ్రి : ఎ..వ..రు….అ..ది

***************************************************************
లిఫ్ట్ కరాదే (అద్నాన్ సమీ) పేరడీ

డీఎమ్కే, మమతా బెనర్జీలు బెదిరించి క్యాబినెట్ పదవులు తీసుకెళ్తున్నారో పక్క, మరో పక్క మన ఆంధ్రా కాంగ్రెస్ ఎంపీలు మేడం ఇంటి ముందు దీనంగా ఇలా అద్నాన్ సమీ పాట పాడుకుంటున్నారు….

తేరి ఊంఛీ షాన్ హై మేడం, హమ్రీ అర్జీ మాన్లో మేడం
తూ హై సబ్ కుచ్ జాన్ నే వాలీ, హమ్ హై తుజ్కో మాన్ నే వాలే
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే

కైసె కైసోంకో దియా హై, ఐసే వయిసోంకో దియాహై
క్యాబినెట్ యా స్టేట్ దిలాదే, ఏక్ నహీ దో చార్ దిలాదే
హాథ్ జోడ్కే సలాం కరేంగే, జిందగీ భర్ గులాం బనేంగే
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే
బంగ్లా మోటర్ గాడీ దిలాదే, హమ్ కో ఏరోప్లేన్ దిలాదే
దునియా బర్ కీ సైర్ కరాదే….

కైసె కైసోంకో దియా హై, ఐసె వైసోంకో దియా హై
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే..


ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారూ, తమకిది తగునా?

ఏప్రియల్ 24, 2009

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటేనే దేశవిదేశాల్లోని భారతీయుల్లో ఓ విధమైన గౌరవనీయ భావన ప్రకటితమవుతుంది. నేనూ అందుకు మినహాయింపు కాదు. ఆయనని అభిమానించే వాళ్ళల్లో నేనొకణ్ణి. సాధారణంగా ఆయన, ఆయన ధర్మపత్ని సుధామూర్తి గారి రచనలు, వ్యాసాలు ఎక్కడ కనిపించినా తప్పక చదివే నేను, ఇవ్వాళ రీడిఫ్.కాం లో మూర్తి గారి ఇంటర్వ్యూ చదివి ఖంగుతిన్నాను. నన్ను ఖంగు తినిపించిన ముక్కలు ఇవిగో..


The Indian society is a society of ideas. It is a society that has revered talk. In this society, articulation is mistaken for accomplishment. We are quite satisfied with our voice, with our writings. This is not a society that is focussed on execution.

Frankly, the problem is due to our caste system and the dominance of Brahmins in our society for long period. The Brahminical system said my job is to think of the higher worlds. My job is to think of connecting you people with God. I don’t want to do anything that has a relationship with the real world.

Now that is a problem that has played havoc with the Indian culture. So, here in this culture, if you do anything with your hands, it is considered less honourable that anything to do with your brain.

పై ముక్కల్ని ఎన్నిరకాలుగా అన్వయించుకుని నన్ను నేను సమాధానపరచుకోవాలని చూసినా కుదరలేదు. అసలు నారాయణమూర్తి లాంటి పెద్దమనిషి కుల ప్రస్తావన తేవటమేమిటి, అందులోనూ బోడిగుండుకీ మోకాలికీ లంకె పెట్టినట్లుగా, దేశంలో కష్టపడి నడుం వంచి పనిచేయటం నామోషి అని జనాలు అనుకోటానికి బ్రాహ్మణులు కారణమని అర్ధం లేని లంకె పెట్టటమేమిటి?

పోనీ ఓ నిమిషం తరతరాలుగా బ్రాహ్మణులు సోమరిపోతులు, నడుం వంచి కష్టపడి పని చేయలేక మతం, దేవుడు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారనుకుందాం. కష్టపడని బ్రాహ్మణుణ్ణి చూసి కష్టపడటం నామోషీ అని ఇతరులు భావిస్తే, ఆ పాపం కూడా బ్రాహ్మణుడిదేనా? ఇదెక్కడి తర్కం?

అలాగే మూర్తి గారు సెలవిచ్చినట్లు, బ్రాహ్మణులు ఇహలోకం కన్నా పరలోక(ఆధ్యాత్మికం) విషయాలపైన శ్రద్ధ ఎక్కువ పెట్టారే అనుకున్నా, దేశంలో ఉన్నవాళ్ళంతా బ్రాహ్మణులొక్కరే కాదు కదా? మూర్తిగారన్నట్లు ఒకవేళ పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే, తప్పు నక్కదా లేక పులిదా? అయినా ఇహలోక సమస్యల సుడిగుండంలో పడి, తట్టుకోలేక చివరాఖరికి మనుష్యులు స్వాంతన పొందేది ఆధ్యాత్మికతతోనే కదా?

కొన్నాళ్ళ క్రిందట “ద వీక్” మేగజీన్లో ఓ పరిశోధనా పత్రం ప్రచురించారు. ఇన్ని రిజర్వేషన్లు తట్టుకుని, మిగిలిన కొద్ది సీట్లలో కూడా చివరికి బ్రాహ్మణులే ఎక్కువ అవకాశాలు ఎలా పొందుతున్నారు అని? ఏదో ఉత్తుత్తి పేపర్ కాదు అది, జన్యుపరంగా కూడా ఎలా బ్రాహ్మణులలో పుట్టుకతోనే కొన్ని కొన్ని విషయాలల్లో అగ్రత్వం ఉంటుంది అన్నది దాని సారాంశం. ఆ పేపర్ నమ్మాలి అని చెప్పటం లేదు కానీ, కొన్ని వందల ఏళ్ళుగా చదువునే ధనంగా భావించే కుటుంబాలలో జన్యువుల ద్వారా విద్య సొంతం అవటం అన్నది అంతగా నోరెళ్ళబెట్టాల్సినంత విషయం కాదని నేచెప్పదలచుకున్నా.

మొత్తమ్మీద, మూర్తిగారు ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇచ్చి ఇచ్చి ఏదో నోరుజారారనే భావిస్తున్నాను తప్ప ఆయన ఆడిపోసుకున్న బ్రాహ్మణత్వం ఆయన, ఆయన కీర్తిప్రతిష్టల రూపంలో మనందరి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే, బ్రాహ్మణత్వం కష్టించి పనిచేయకపోటానికి కారణభూతం అంటే ఎవరు నమ్మేది? హాస్యాస్పదంగా లేదూ?


విరామం

ఫిబ్రవరి 22, 2009

కొన్ని వ్యక్తిగత పనులవల్ల బ్లాగుకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. సెలవు.